భారీ వర్షాలు…రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన అచ్చెన్నాయుడు !

-

 

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను అలర్ట్‌ చేశారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు..
రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారికి సూచించారు.

Atchannaidu alert on ap heavy rains

శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాజశేఖర్ గారితో ఫోన్ లో మాట్లాడి పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version