ఏపీని 3 ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయిలకు పంచాడు : అచ్చెన్నాయుడు

-

ఏపీని 3 ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయిలకు పంచాడని సిఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఏపీని 3 ముక్కలు చేసి.. బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అని నిలదీశారు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు.

బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. మూడేళ్లల్లో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా..? వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చించేందుకు సిద్ధమా..? అని నిలదీశారు.

రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని వైసీపీకి అర్థమైందని.. అందుకే తమ నేతకు ఇప్పుడు కూడా మంత్రి పదవి రాకపోతే ఎట్లా అంటూ రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారని అగ్రహించారు. వైఎస్ కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపమని.. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే జగనుకు బీసీలంటే కోపమని ఆరోపణలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news