వైసీపీలో పదవుల చిచ్చు..ఎమ్మెల్యే పదవికి బాలినేని రాజీనామా !

-

అధికార వైసీపీ పార్టీలో పదవుల చిచ్చు నెలకొంది. మంత్రి పదవి రాకపోవడంతో.. ఏపీలో కీలక నేతలు, మాజీ మంత్రులు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌….. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా వైసీపీ కీలక నేతలతో బాలినేని సమావేశం అయ్యారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి ఇప్పటికే బాలినేనితో సమావేశం అయ్యారు. త్వరలోనే బాలినేని రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక అటు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. అలాగే.. ఏపీ మాజీ హోం మంత్రి సుచరిత అయితే.. ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పదవుల పంపకం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news