జీవితాంతం..జగన్ కళ్ళు మూసుకునే ఉండాలి – భానుప్రకాష్ రెడ్డి

-

జీవితాంతం..జగన్ కళ్ళు మూసుకునే ఉండాలంటూ సెటైర్లు పేల్చారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు NDA కూటమికి పట్టం కట్టారని… స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు జగన్ అంటూ విమర్శలు చేశారు. గోడల‌ మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు…. పంచభూతాలను ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏపీని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా చేసాడని జగన్‌ పై మండిపడ్డారు‌‌.

bhanu prakash reddy slams jagan

కలియుగ దైవం వద్ద మొదలైన ప్రక్షాళన ఎఫెక్ట్ తాడేపల్లికి తగిలింది…సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ధనం పైనే వీళ్ళ కళ్ళుపడ్డాయని ఆగ్రహించారు. టిటిడి పనులలో కమీషన్లు కరుణాకార్ రెడ్డి తీసుకున్నాడు…. టిటిడి ని రాజకీయ పునరావాసం గా మార్చేసారని ఫైర్ అయ్యారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక రాజధాని… వారి ఐదేళ్ళలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా…? అని నిలదీశారు. టిటిడిలో ఐదేళ్ళలో జరిగిన అన్నిటి పైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా కూటమి పైన ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news