హీరోయిన్ తో మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులను ఆశ్రయించిన బోండా ఉమ

-

ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విస్తృతంగా మారింది. ఈ సోషల్ మీడియావలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంత కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ట్రోలింగ్, నెగటివ్ పబ్లిసిటీలతో సెలబ్రిటీలకి పిచ్చెక్కుతోంది. తాజాగా అలాంటి అంశం మీదే హైదరాబాద్ పోలీసులను విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆశ్రయించారు. తన మీద సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తునారని ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ నుంచి హీరోయున్ తో బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారని, కొంత మంది ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులు తన ఫై ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో ప్రజల్లో తనపై లేని అనుమానాలు వ్యక్తం అవుతాయాని ఫిర్యాదులో బోండా ఉమా పేర్కొన్నారు. అసలు సదరు ఆ హీరోయిన్ ఎవరో తనకు తెలియదని తనకు సంబంధం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు బోండా ఉమా.

Read more RELATED
Recommended to you

Latest news