న్యాయవ్యవస్థ పై వైసీపీ దాడి అమానుషం : బొండా ఉమ

-

న్యాయవ్యవస్థ పై వైసీపీ దాడి అమానుషమని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. ఇది న్యాయ వ్యవస్థను వైసీపీ బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేదే లేదన్న ఆయన రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో ఏ కోర్టు తీర్పు ఇవ్వదని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొన్న ప్రతి నిర్ణయం చట్ట వ్యతరేకం కాబట్టే కోర్టు లు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయని అన్నారు.

సీబీఐ కోర్టులో రోజు వారీ విచారణ ప్రారంభం కాగానే జైలు తప్పదని జగన్ కు అర్థమైందని అన్నారు. 16 కేసుల నుంచి జగన్ ఎటువంటి పరిస్థితులలో తప్పించి కోలేరని అన్నారు. సీబీఐ కోర్టు రోజు వారీ విచారణ ప్రారంభం అయినందుకే పధకం ప్రకారం కోర్టుల మీద జడ్జిల మీద ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా ఈ సంస్కృతి లేదన్న ఆయన నేరస్థులు పాలకులయితే పాలన ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news