తిరుమలలో చిరుతల దాడులపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

-

తిరుమలలో చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతలు.. ఇప్పటికీ అక్కడక్కడ సంచరిస్తూ కలకలం రేపుతూనే ఉన్నాయి. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులకు అసలు కునుకు లేకుండా చేస్తున్నాయి. తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీనేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయన్నారు. 

వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారు అంటూ విమర్శించారు. వైసీపీ పుష్పాలు ఎర్ర చందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేస్తున్నారు. ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లనే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయన్నారు. చిరుతపులిని తరమడానికి రూళ్ల కర్ర ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ఆ రూళ్ల కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా..? అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బోండా ఉమ. మేము విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం.. వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుందని విమర్శించారు బోండా ఉమ. 

Read more RELATED
Recommended to you

Latest news