భువనేశ్వరి, పురంధేశ్వరికి బొత్స కౌంటర్..!

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పై కౌంటర్ ఎటాక్ కి దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో మీడియాతో మాట్లాారు. ఓవైపు చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా.. న్యాయం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు పురంధేశ్వరి. అయితే ఒకేసారి ఇద్దరిపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స.

చంద్రబాబు అరెస్ట్ పై సాక్ష్యాధారాలు ఉన్నాయని.. న్యాయస్థానం చెప్పిందన్నారు. న్యాయస్థానం చెప్పింది కూడా తప్పు అనడం విడ్డూరమన్నారు. న్యాయస్థానం మీద పోరాటం చేస్తున్నారా..? న్యాయస్థానానికి తప్పు ఆపాదిస్తున్నారా అని భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మద్యం అమ్మకాలపై బీజేపీ అధిష్టానానికి.. కేంద్ర ప్రభుత్వానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేయడంపై స్పందించారు బొత్స సత్యానారయణ. మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దానిపై ఎలాంటి దర్యాప్తు చేపట్టినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news