బ్రేకింగ్ : మంత్రి బొత్స ఇంట తీవ్ర విషాదం.!

-

విజయనగరం జిల్లాకి చెందిన ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ ఈ తెల్లవారు జామున విశాఖలో మృతి చెందారు. సుమారు గత నెల రోజులుగా తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు.

ఇక ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు ఇప్పుడు ఏపీలో పురపాలక శాఖా మంత్రిగా ఉండగా, రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఈరోజు విజయనగరంలోని స్వర్ఘధామంలో ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రికి మాత్రు వియోగం కలిగిందన్న వార్తతో వైసీపీ శ్రేణులు బొత్సకు తమ సంతాపం తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news