BREAKING : మంత్రి బొత్స ఇంట విషాదం..!

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి ఈశ్వరమ్మ(84) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇవాళ మధ్యాహ్నం విజయనగరంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇకపోతే ఈశ్వరమ్మకు మొత్తం 11 మంది సంతానం. నలుగురు కుమార్తెలు, ఏడుగురు కుమారులు ఉండగా వారిలా బొత్స సత్యనారాయణ పెద్దవాడు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య  ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news