తిరుమలలో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు – వైభవంగా 7వ రోజు

-

Tirumala Temple : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్‌. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఏడోవ రోజు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.

ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల స్వామివారు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…. తిరుమలలో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఇక ఎల్లుండితో ముగియనున్నాయి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.

కాగా, డిసెంబర్ ఒకటి నుంచి 22వ తేదీ వరకు రూ 300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అటు ఇవే తేదీలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోట టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోట టికెట్లను విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news