విశాఖలో దారుణం.. సిగరేట్ కోసం బాలుడి హత్య..!

-

విశాఖ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా చిన్న, పెద్ద లేకుండా హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా విశాఖలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం గోనె సంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేశారు. విశాఖ వన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. 

చిన్న అలియాస్ విస్కీ(17)ని బటన్ నైఫ్ తో నలుగురు యువకులు గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. సిగరేట్ కోసం గొడవపడి అసభ్య పదజాలంతో దూషించినందుకు కోపంతో నలుగురు యువకులు దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన తరువాత దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి ఫిషింగ్ హార్బర్ లోని 11వ నెంబర్ జెట్టిలో పడేసి ఆ యువకులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. నలుగురు యువకులు పట్టుబడ్డారు. నిందితులను జువైనల్ హోంకి తరలించారు. 

Read more RELATED
Recommended to you

Latest news