సీఎం చంద్రబాబును కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

-

BRS MLAs met CM Chandrababu: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరో ఝలక్ ఇచ్చారు గులాబీ నేతలు. కొంతమంది గులాబి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే… తాజాగా చంద్రబాబు నాయుడు ను గులాబీ ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. నిన్న ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్లీ పైకి లేపుతానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

BRS MLAs met CM Chandrababu

ఆయన ప్రకటించిన తర్వాత గులాబీ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో గులాబీ పార్టీని వీడి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబు పార్టీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయనకు.. ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రకాష్ గౌడ్ అలాగే అరికపూడి గాంధీ వెళ్ళినట్టు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news