విశాఖ తెలుగు తల్లి ఫ్లె ఓవర్ పై కారు బీభత్సం…ఒకరు మృతి

-

విశాఖ తెలుగు తల్లి ఫ్లె ఓవర్ పై మద్యం మత్తులో యువకుల కారు బీభత్సం సృష్టించింది. రెండు బైక్ లను ఢీకొట్టింది కారు. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే ఒకరు మృతి చెందారు. అటు ఫ్లె ఓవర్ పై నుండి కిందకి బోల్తా కొట్టింది కారు. ఇక ఈ సంఘటన లో మరో యువకుడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు విజయవాడకు చెందిన జై కృష్ణ గా గుర్తించారు పోలీసులు.

మద్యం మత్తులో అతివేగంగా కాకాని చార్విక్ అనే వ్యక్తి కారు నడిపాడు. మురళి నగర్ లో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ గా ఉంటున్నాడు కాకాని చార్విక్. చార్విక్ స్వస్థలం గన్నవరం. నిన్న ఓ పార్టీ లో ఫుల్ గా తాగి మధ్యం మత్తులో అతివేగంగా కారు నడిపి రెండు నిండు ప్రాణాలను తీశాడు చార్విక్. ఇక ప్రస్తుతం విశాఖ 2 టౌన్ పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news