వివేకా హ‌త్య కేసులో సీబీఐ మ‌రో ఛార్జీ షీట్ దాఖ‌లు

-

వైఎస్ వివేకా నంద హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ హ‌త్యా కేసులో నిందితుడుగా ఉన్న దేవి రెడ్డి శివ శంక‌ర్ రెడ్డి పై సీబీఐ అధికారులు ఛార్జి షీట్ వేశారు. నిందితుడు శివ శంక‌ర్ రెడ్డిపై సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో చార్జిషీట్ వేశారు. వైఎస్ వివేకా నంద హ‌త్య కేసులో 5వ నిందితుడిగా దేవి రెడ్డి శివ శంక‌ర్ రెడ్డి పేరును చేరుస్తు సీబీఐ అధికారులు పులివేందుల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాగ దేవి రెడ్డ‌డి శివ శంక‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం క‌డ‌ప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు.

అయితే వైఎస్ వివ‌కా నంద హ‌త్య కేసులో శివ శంక‌ర్ రెడ్డి ని గ‌త ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో సీబీఐ అధికారులు హైద‌రాబాద్ లో అరెస్టు చేశారు. కాగ వైఎస్ వివేకా నంద హ‌త్య కేసులో సీబీఐ అధికారులు గ‌తంలోనే ఒక ఛార్జిషీటు దాఖలు చేశారు. సీబీఐ అధికారులు మొద‌ట దాఖ‌లు చేసిన ఛార్జిషీట్ లో నిందితులుగా ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను సీబీఐ అధికారులు చేర్చారు. కాగ తాజా గా సీబీఐ అధికారులు దాఖ‌లు చేసిన రెండో ఛార్జిషీట్లో దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని 5వ నిందితుడిగా సిబిఐ అధికారులు చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news