రాజమండ్రి కాతేరులో చంద్రబాబు రా.. కదలిరా సభలో గందరగోళం

-

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా జనసేన-టీడీపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే చంద్రబాబు 2, పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలను ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు మండపేట, అరకు అభ్యర్థులను ఇటీవల ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన రెండు రోజులకే పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.

తాజాగా చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. రాజానగరం టికెట్ జనేనకు ప్రకటించడం పై తీవ్ర నిరసన చేశారు. ప్రధానంగా టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా స్టేజీపైకి వచ్చి చాలా దూకుడుగా కిందకి దిగడంతో స్టేజీ పై నుంచి చంద్రబాబు కిందకు పడపోబోయాడు. చంద్రబాబు కింద పడకుండా వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. దీంతో కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news