కందుకూరు మృతులకు చంద్రబాబు అండ..రూ.10 లక్షల చొప్పున సాయం

-

నిన్న చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు అధ్యక్షతన ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట ఏర్పడడంతో 8 మంది మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయాల పాలైన వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో వెంటనే పక్కనే ఉన్న కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారని తెలుస్తోంది. అలా పడిపోయిన వారికి గాయాలు కాగా 8 మంది మృతి చెందారు. అయితే, మృతి చెందిన కుటుంబాలకు చంద్రబాబు పార్టీ తరఫున అండగా నిలిచారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. సభా వేదికగా ఈ ప్రకటన చేశారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news