నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన

-

దాదాపుగా రెండు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీబిజీగా గడిపారు. క్షణం తీరికలేకుండా ప్రజల్లోకి వెళ్లారు. ఎట్టకేలకు పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీరేందుకు సమయం దొరికింది. మరోవైపు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాస్త టెన్షన్ లో కనిపిస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహార యాత్రలకు బయల్దేరుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.  ఈ నెల 31వ తేదీన జగన్‌ తిరిగి తాడేపల్లికి రానున్నారు.

 

మరోవైపు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా విదేశీ విహారానికి ప్లాన్ చేశారు.  సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఆయన .. విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఆదివారం బయల్దేరి వెళ్లి, ఆరు రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news