కుట్రకు చంద్రబాబే కారణం.. కోర్టులో 28 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌

-

చంద్రబాబు కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసింది సీఐడీ. రిమాండ్ రిపోర్టులో సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలనే ప్రధానంగా పేర్కొన్న సీఐడీ…కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందించింది. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబు పై నేరాభియోగం, ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలు మోపింది. ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని నివేదిక అందించింది.

డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు పై అభియోగాలు మోపింది సీఐడీ. 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సీఐడీ అధికారులు…. డిజైన్ టెక్ సంస్థ… కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్న సీఐడీ అధికారులు…. టెక్నాలజీ పార్టనర్లుగా నామినేషన్ పద్దతిలో ఈ సంస్థలను నియమించారని, వారికి 371కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరు చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సీఐడీ.

Read more RELATED
Recommended to you

Latest news