ఆగస్టు 1 నుండి చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన

-

ఆగస్టు 1 నుండి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను సందర్శిస్తారని ఆ పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకే చంద్రబాబు ఈ పర్యటన చేపట్టారని పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని.. ఆగస్టు 3వ తేదీన గండికోట రిజర్వాయర్ పరిశీలన, ఆగస్టు 4న కళ్యాణదుర్గంలో భైరవాణి తిప్ప ప్రాజెక్ట్, పేరూరు లో ఇతర ప్రాజెక్టులను పరిశీలిస్తారని తెలిపారు.

ఆగస్టు 3న చంద్రబాబు అనంతపురం జిల్లాకు వస్తారని తెలిపారు కాల్వ శ్రీనివాసులు. చంద్రబాబు పర్యటనలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన ద్వారా సీఎం జగన్ దుర్మార్గాలు, అవినీతిని ఎండగడతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news