పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు : జగన్

-

పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు అంటూ చురకలు అంటించారు ఏపీ సీఎం జగన్. పలాస సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. “ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్ లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్…. మ్యారేజి స్టార్.

ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంట్గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు” అని జగన్ ఎద్దేవా చేశారు.

ఇది ఇలా ఉండగా, ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలేంటో తెలుసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. “జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నా ఆదుకుంటున్నాం. మనసు నిండా అభిమానంతో ప్రజల కోసమే పనిచేస్తున్నాం” అని పలాస సభలో జగన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news