అప్పులు చేయడంలో సీఎం జగన్ సరికొత్త రికార్డ్ సృష్టించారు – పట్టాభిరామ్

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బిఐ వద్ద అప్పులు చేయడంలో సీఎం జగన్ సరికొత్త రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు. ఆర్బిఐ నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు రూ. 29,500 కోట్లు అప్పు చేసి ఆర్బిఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా జగన్ నిలిపారని ఎద్దేవా చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఆర్బిఐ నుండి 40 వేల కోట్ల అప్పుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే.. 29,500 కోట్ల అప్పుతో ఏపీ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా 14 మంగళవారాలు ఆర్బిఐ దగ్గర అప్పు చేయలేదని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బిఐ వద్ద మొట్టమొదటగా అప్పు చేసి బోనీ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news