ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం – కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన వరంగల్ నగరాన్ని, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలను కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇటీవల లంబాడీల పై చేసిన వ్యాఖ్యల పట్ల కిషన్ రెడ్డి స్పందించారు.

ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలోని వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందం తెలంగాణకు రానుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news