సీఎం జగన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు – నారా లోకేష్

-

వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసిపి పాలనలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అయిపోయాయని ఆరోపించారు. కనీసం ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని అన్నారు. నాడు దండగ అన్న జగన్ కి నేడు పట్టిసీమ దిక్కు అయిందని ఎద్దేవా చేశారు.

రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా పట్టిసీమ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించిందని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి – కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు అని పేర్కొన్నారు. పులిచింతల – గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శించారు. అనంతరం గన్నవరం నియోజకవర్గం అంపాపురం గ్రామస్తులు నారా లోకేష్ ని కలిసి తమ సమస్యలను వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news