కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారు – సోము వీర్రాజు

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సిగ్గు లేకుండా సీఎం జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టలేని దిక్కుమాలిన దుస్థితికి వచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసిపి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

 

గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గృహ నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మునిసిపల్ కార్మికులను కూడా ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితికి వచ్చిందన్నారు. ఇక టిడిపి, జనసేన పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news