పార్టీ మార్పు పై స్పందించిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు

-

బిజెపి నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు సోయం బాపూరావు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థం లేని ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. ఈనెల 27న తన కుమారుడి పెళ్లి ఉన్నందున అన్ని పార్టీల వారికి పత్రికలు ఇస్తున్నానని.. పార్టీలకు అతీతంగా నేతలందరినీ పిలుస్తున్నానని అన్నారు.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సైతం పత్రిక ఇస్తానన్నారు. మహేశ్వర్ రెడ్డిని బిజెపిలోకి తానే ఆహ్వానించానని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక ఒక కర్ణాటకలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గెలిచినట్లు కాదన్నారు సోయం బాపురావు. బిజెపి కర్ణాటకలో ఓడిపోయినా ఓట్ల శాతం తగ్గలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news