సీఎం జగన్ బీసీలకు చేసిందానికంటే దోచుకున్నదే ఎక్కువ – యనమల

-

సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ చేసిన దానికంటే దోచుకున్నదే ఎక్కువ అని ఆరోపించారు. బీసీల నుంచి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలలో కోత వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

yanamala ramakrishnudu

 

జనగణన కోసం చేసిన అసెంబ్లీ తీర్మానంపై జగన్ రెడ్డి నోరు మెదపడం లేదని అన్నారు. తడి గుడ్డతో గొంతులు కోస్తూనే బీసీలకు తోడుగా ఉన్నానంటూ జగన్ చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు కనీస పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆగమేగాల మీద బడుగు బలహీన వర్గాల ఇల్లు ఖాళీ చేయించి రోడ్లు వేయించుకున్న ముఖ్యమంత్రి.. బీసీ కాలనీలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news