BREAKING : ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్…ప్రధానితో కీలక సమావేశం

-

అమరావతి : ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్ మోహన్‌ రెడ్డి రానున్నారు. ఇందులో భాగంగానే.. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్. సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం… రేపు ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో జరుగనున్న న్యాయ సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ సమావేశం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరుగనుంది. ఉన్నత విద్య పై సమీక్ష చేపట్టిన అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇది ఇలా ఉండగా.. నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు. సమకాలీన రాజకీయ, సమాజిక అంశాలపై లోతుగా చర్చించిన గవర్నర్, సీఎం.. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని గవర్నర్ కు వివరించారు సీఎం జగన్. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ముఖ్యమంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news