థియేటర్స్ వధ్ద మెగా అభిమానుల రచ్చ.. నైట్ నుంచే సందడి

-

తొలిసారి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన సినిమా ఆచార్య. అయితే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నిన్న రాత్రి నుంచే మెగా అభిమానులు ఆచార్య విడుదలవుతున్న థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. భారీ భారీ కటౌట్స్ కడుతూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకున్న మెగా అభిమానుల కోరిక నేటితో తీరనుంది. అయితే ఎప్పటినుంచో మెగా అభిమానులు ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కావడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు చిరంజీవి, చరణ్ కటౌట్లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో సందడి చేస్తున్నారు.

ఇందులో చరణ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని ముందునుంచి మేకర్స్ చెబుతున్నారు. ఇందులో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ ఆచార్య సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా మొన్ననే రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ విజయంతో చరణ్ జోరుమీదున్నాడు. రిలీజ్ కు ముందు విడుదలైన ఆచార్య టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పైన అంచనాలను పెంచాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఆచార్య సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news