నేడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన..రెండు రోజుల పాటు అక్కడే

-

 

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్…పదిన్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు సీఎం జగన్‌. ఇవాళ సాయంత్రం ప్రధాని, హోం మంత్రి లతో సీఎం జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

CM Jagan will visit Delhi
CM Jagan will visit Delhi

ఇక ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు సీఎం జగన్‌. ఎల్లుండి ఉదయం 10 గంటలకు విఙాన్ భవన్ కు చేరుకోనున్న సీఎం జగన్‌… మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. అనంరం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 10 రాష్ట్రాలు హాజరుకానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ‌ సమావేశం కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news