ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

-

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు శుభాకాంక్షలు తెలియజేశారు.

CM-Jagan-wishes-Vinayaka-Chavithi
CM-Jagan-wishes-Vinayaka-Chavithi

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి అభిలషించారు సీఎం జగన్‌.

ఇటు వినాయకచవితిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ ప్రజలుకు శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news