రాష్ట్రంలో అమలువుతోంది సీఎం జగన్ చట్టాలే : బుద్దా వెంకన్న

-

ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతుంది సీఎం జగన్ చట్టాలే అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఇవాళ మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న సీఎం జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. పురాణాల్లో కూడా లేని రాక్షసులు సీఎం జగన్ లో కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలను విమర్శిస్తే కేసులు పెడుతున్నారని.. తాము విమర్శిస్తే.. వైసీపీ నాయకులు విమర్శిస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కష్టపడి ఫ్యామిలీ మొత్తం కూడా అందులో పని చేసి.. కార్మికులుగా పని చేసి హెరిటేజ్ కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్లు. జగన్ మోహన్ రెడ్డి ఏ కంపెనీ నడిపాడు. ఇవాళ ఎన్ని లక్షల కోట్లు.. ఇసుక, మైనింగ్ వంటి వాటిలో వేల కోట్లను సంపాదించాడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి వెనుక చంచాలుగా ఉండి.. కొడాలి నాని, పేర్నినాని, వంశీ నాయకులు చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.టీడీపీ నాయకులు మాట్లాడితే వారిపై కేసుుల పెడతారా..? ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పన్నాగం పండిందని చెప్పుకొచ్చారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news