చంద్రబాబు దద్దమ్మ అయితే..లోకేష్‌ పప్పుగాడు – రోజా

-

చంద్రబాబు దద్దమ్మ అయితే..లోకేష్‌ పప్పుగాడు అంటూ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. నగరిలోని జగనన్న నగర్ కాలనీలో మౌలిక వసతుల పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు మంత్రి రోజా. నగరిలో సుమారు 4.50 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల కాలనీలో వసతులన్నింటినీ పూర్తి చేసి అతి త్వరలోనే లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో ప్రారంభమైనా, చంద్రబాబు నాయుడుకి, ఆ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు. టిడ్కో ఇళ్ల దగ్గర టీడీపీ పప్పులు వచ్చి సెల్ఫీలు దిగారు…ఒకడేమో మంగళగిరి పప్పు…ఇంకోడేమో ఈ నగరి పప్పు అంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి రోజా. టిడ్కో ఇళ్ల దగ్గర నిలబడి సిగ్గులేకుండా సెల్ఫీలు దిగారని ఆగ్రహించారు. ఆ సెల్ఫీలు దిగిన ఇద్దరు పప్పులను సూటి ప్రశ్నిస్తున్నానని.. టిట్కో ఇళ్లలో, నీళ్లు, కరెంటు, రోడ్లు ఏమీ లేకుండా…..గాలికొదిలేసి..ఏ మొహం పెట్టుకుని సెల్ఫీ దిగారని ఆగ్రహించారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news