ఏపీ రాజధానిలో డబ్బుల కట్టలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. వెంగళాయ పాలెం వద్ద జాతీయ రహదారిపై నకలీ కరెన్సీని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వదిలి వెళ్ళారు. పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందడంతో బ్యాగును స్వాధీనం చేసుకున్న నల్లపాడు సిఐ వీరాస్వామి… బ్యాగ్ లో రెండు వేలు, ఐదు వందల నోట్లు ఉన్నాయి అని గుర్తించారు.

రెండు వేల రూపాయల నోటుపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్ర ఉంది. రెండున్నర కోట్ల రూపాయల నోట్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై సిఐ మాట్లాడుతూ… నకిలీ కరెన్సీ పై దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. నగదు డిపాజిట్ మెషీన్లు నకిలీ కరెన్సిని తీసుకుంటున్నట్లు గుర్తించాం అని చెప్పారు. విజయవాడ, గుంటూరు నగరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news