పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

-

మంగళవారం ఢిల్లీలో నిర్వహించబోయే ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్లడాన్ని నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ ప్రయాణం చేగువేరా నుండి సవర్కర్ వరకు జరిగిందన్నారు.

ఎన్డీఏ కూటమి సమావేశానికి పవన్ ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అతివాదం నుంచి మితవాదుడైన సవర్కర్ పాలసీలోకి వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చిన పవన్ కళ్యాణ్ నేడు ఎన్డీఏలో ఎలా చేరుతున్నారో చెప్పాలంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news