ఎంపీ పిల్లి సుభాష్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ

-

అమరావతి: వైఎస్ఆర్సిపి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఉదయం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పెళ్లి సుభాష్ మధ్య రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో టికెట్ విషయంలో ఈ అసమ్మతి భగ్గుమంది.

దీంతో అప్రమత్తమైన హై కమాండ్ నేడు పిల్లి సుభాశ్ ని తాడేపల్లికి పిలిపించుకున్నారు. ఈ భేటీలో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను, వారి మధ్య నెలకొన్న వివాదాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ తో భేటీ తర్వాత మంత్రి, ఎంపీల మధ్య వైరం ముగిసినట్లేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news