‘చలో మదనపల్లి’ నేపధ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతల అరెస్ట్

-

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు చలో మదనపల్లి కార్యక్రమనికి దళిత నేతలు పిలుపునిచ్చారు. ఈ చలో మదనపల్లి కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు జిల్లా మొత్తం మీద పోలీసులు మోహరించారు. న్యాయవాది శ్రవణ్ బస చేసిన హోటల్ వద్దకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ముస్లిం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక మరో పక్క తిరుపతి లోని తిరుమల బై పాస్ రోడ్ లో మాజీ జడ్జి రామకృష్ణ కార్ కీస్ లాకున్న పోలీసులు, మొదట సెల్ ఫోన్లు, పర్సు కూడా లాక్కోగా ఇప్పుడు అవి తిరిగి ఇచ్చేశారు. నడి రోడ్ పైన తనపైన పోలీసుల దోపిడీ, దాడి జరిగిందని రామకృష్ణ ఆరోపించారు. తనకు ఏమి జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమని, విచారణ చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా దళిత నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news