కేసీఆర్ ను ఓడించేందుకు కులాలను, మతాలను రెచ్చగొట్టారు – ఏపీ డిప్యూటీ సీఎం

-

కేసీఆర్ ను ఓడించేందుకు కులాలను, మతాలను రెచ్చగొట్టారని ఆగ్రహించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ… నేను కాంగ్రెస్ వాదిని…ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ తోనే జీవనం సాగిస్తున్నారన్నారు.

Deputy-CM-Narayana-Swamy on KCR

సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు కులాలను, మతాలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. కానీ హైదరాబాద్ సిటీలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది…అయినా చంద్రబాబు కొన్ని మీడియా సంస్థలు పండుగలు చేసుకుంటున్నారని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ కు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని..అక్కడ బిజెపితో కలుస్తాడు.. ఇక్కడ టిడిపితో కలుస్తాడన్నారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంట అంచనా జరుగుతుంది…ప్రభుత్వం నిరంతరం సహాయక చర్యలు తీసుకుంటుందన్నారు. 200 ఎకరాలు భూమిని కబ్జా చేశాడని నారా లోకేష్ నన్ను విమర్శిస్తున్నాడని ఆగ్రహించారు. ఎ క్కడ ఉందో చెప్పి.. నిరూపించాలి..నాపై విమర్శలు చేస్తే వంశమే ఉండదని స్పష్టం చేశారు ఏపీ డిప్యూ టీ సీఎం నారాయణ స్వామి.

 

Read more RELATED
Recommended to you

Latest news