చంద్రబాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే – ధర్మాన

-

చంద్రబాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు ఏపీ మంత్రి ధర్మాన. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు. బాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే, చంద్రబాబు కన్నా ముందే మనం తుపాకీ పేల్చాలని పిలుపునిచ్చారు. ఏది మంచి ప్రభుత్వమని చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందన్నారు మంత్రి ధర్మాన.

రెవెన్యూ శాఖలో సంస్కరణలపై చర్చించేందుకు, ప్రభుత్వ విధానాలను క్లియర్ గా చెప్పేందుకు రీజినల్ సదస్సు నిర్వహిస్తామని..అసైన్డ్ భూములపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించిన 77యాక్ట్ కు సవరణలను ప్రతిపాదిస్తాం…..22(ఏ)భూములపై సర్వే త్వరితగతిన జరుగుతోందని వెల్లడించారు.

సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని..ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ పద్ధతి అని పేర్కొన్నారు. భూములపై సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాతే ఇకపై రిజిస్ట్రేషన్ లు జరుగుతాయని..భూమి విలువ పెరగడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి కారణంగా మారిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news