గతంలో జగన్ ఒళ్ళు బలిసి పాదయాత్ర చేశాడా..? – ధూళిపాల నరేంద్ర

-

వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే యువగళం పాదయాత్రకి నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వడం హస్యాస్పదం అన్నారు. పాదయాత్రలకు అనుమతి అవసరం లేదని జగన్ రెడ్డి తల్లి విజయమ్మే చెప్పిందన్నారు. లోకేష్ పాదయాత్ర పై ప్రభుత్వం తీరు సరైంది కాదన్నారు. గతంలో జగన్ ఓళ్లు బలిసి పాదయాత్ర చేసాడా..? తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కులాల వారిగా మంత్రులతో తిట్టించే పని చేస్తున్నారని ఆరోపించారు. కేవలం తిట్టడం కోసమే మంత్రులు పని చేస్తున్నారని మండిపడ్డారు ధూళిపాల. వారి శాఖలలో ఏం జరిగుతుందో మంత్రులకు తెలియదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. లోకేష్ పాదయాత్ర తో వైసిపి అరాచకానికి స్వస్తి పలుకుతామన్నారు. లోకేష్ యావగళం పాదయాత్ర నవశకానికి నాంది అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని.. ఏపి పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. లోకేష్ పాదయాత్రపై వైసిపి కుట్రలను ఎదుర్కొంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news