ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..డిసెంబర్‌ లో 1,10,672 టిడ్కో ఇళ్ల పంపిణీ

-

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌. డిసెంబర్‌ లో 1,10,672 టిడ్కో ఇళ్ల పంపిణీ చేయనుంది జగన్‌ సర్కార్‌. జనసేన సోషల్ ఆడిట్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్ష పార్టీలు తమ పద్ధతి మార్చుకోవాలని పేర్కొన్నారు.

లేకుంటే ప్రజలే తిరగబడి తరుముతారని చెప్పారు. మంగళగిరిలో లబ్ధిదారులే జనసేన పార్టీ నాయకులపై తిరగబడటం దీనికి ఉదాహరణ అన్నారు. అన్ని వసతులతో రాష్ట్రంలో ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని.. డిసెంబర్ నాటికి మరో 1,10,672 ఇళ్లను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. మార్చి నాటికి మిగిలిన 1,10,968 ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఆదిమూలపు సురేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news