దివ్య తేజస్విని మర్డర్ : నాగేంద్ర డిశ్చార్జ్.. వెంటనే అరెస్ట్ !

-

విజయవాడ దివ్య తేజస్విని కేసు పోలీసులకి సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్య జరిగిన రెండు రోజులు గంట గంటకూ ఓ విషయం బయట పడడంతో ఈ కేసు మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ముందు ప్రేమించడం లేదని నాగేంద్ర బాబు చంపేసినట్టు బయటకు రాగా తరువాత ఇద్దరికీ పెళ్లి జరిగింది, ఆ తరువాత అమ్మాయి తల్లితండ్రులు కలిసి బ్రతకనివ్వరని, ఇద్దరం కలిసి ఆత్మహత్యాయత్నం చేశానని నిందితుడు మీడియాకి చెప్పాడు.

దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరికి దివ్య తేజస్విని శరీరం మీద ఉన్న గాయాలు సొంతంగా చేసుకున్నవి కాదని రిపోర్ట్ లో పేర్కొంది ఫోరెన్సిక్ శాఖ. ఈ గాయాల మీద సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీస్ శాఖ దాని ఆధారంగా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నాగేంద్ర చంపాడని తేల్చారు. ఇక ఈ నాగేంద్ర గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు కానీ రేపు కానీ కోర్టు లో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news