టీడీపీకి విరాళాలు ఇవ్వండి.. వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

-

విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు. ఈ, ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ స్థాపించి ఇన్నేళ్లు అయినా చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు లేవు.. ప్రజల గురించే పార్టీ ఆలోచన ఉంది తప్ప, పార్టీ కార్యాలయాల కోసం ఎన్నడూ ఆలోచనే చేయలేదు.. ప్రజల్లో టీడీపీ ఓ భాగం అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన పార్టీ టీడీపీ.. పబ్లిక్ పాలసీలతో ప్రజల జీవితాల్లో పెను మార్పులు తేవచ్చు.

ఐటీని ప్రొత్సహించాం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది.. ప్రజల అవసరాలను.. వారి భవిష్యత్తును ఆలోచించి మేం విధానాలను రూపొందించాం.. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర్నుంచే మేం విరాళాలు సేకరించాం.. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించింది అని చంద్రబాబు అన్నారు. గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించి.. ఆన్ లైన్ గ్యాంబ్లింగుకు అనుమతించాలని సమయం కోసం వైసీపీ ఎదురు చూసింది అని చంద్రబాబు అన్నారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం.. రాష్ట్రం కోసం పని చేయాలి.. టీడీపీ విధానాల వల్ల తాము ఎలా బాగుపడ్డామనే విషయాన్ని ప్రజలకు వివరించాలి.

Read more RELATED
Recommended to you

Latest news