‘వల్లభనేని వంశీ’, ‘దుట్టా’ల ముందే కొట్టుకున్న ఇరువురి అనుచరులు !

-

గన్నవరం వైసీపీలో ముసలం పుట్టింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి బయటి నుండి మద్దతిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పార్టీ పుట్టిన నాటి నుండి జగన్ వెనుక నడుస్తోన్న వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా ఈ ఇద్దరి అనుచరులు తమ నాయకుల ఎదుటే తన్నుకున్నారు.

ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గన్నవరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని వైసీపీ గూటికి చేర్చారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోని వంశీ వైసీపీకి మద్దతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news