ఆ మూడు పార్టీలు ఒక్కటైనా జగనే మళ్లీ సీఎం.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ, జనసేన.. తాజాగా మరో అడుగు ముందుకేశాయి. త్వరలో జరుగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కూడా తమ కూటమిలో కలుపుకోని ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో భాగం కాగా.. తాజాగా చంద్రబాబు సైతం బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడేందుకు రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొత్తులపై ఆయన చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా.. 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదని జోస్యం చెప్పారు. 2019లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news