నేడు చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు

-

 

నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ నేటికి 16వ రోజుకు చేరింది. ఈ తరుణంలోనే నేడు జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు కుటుంబ సభ్యులు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8 గంటల తర్వాత ములాకాత్ కోసం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ధరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం ఉంది.

ములాఖాత్ కు చంద్రబాబు భార్య భువనేశ్వరీ, కోడలు నారా బ్రాహ్మణితో పాటు మరొకరు వెళ్లనున్నారు. కాగా, స్కిల్‌ డెవలప్​మెంట్ సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్​లో ఉన్నారు. రిమాండ్ గడువు, రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం ముగియడంతో రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచారు. ఈ సందర్భంగా బాబు రిమాండ్​ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించారు.

Read more RELATED
Recommended to you

Latest news