AP : డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే 20 వేలు జరిమానా !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ రూల్స్‌ ఎప్పటి నుంచి అమలు అవుతాయే తెలియాల్సి ఉంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు రుణం తీసుకుంది. మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని… 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా 7.43% వడ్డీతో రూ. 1,000 కోట్ల మొత్తాన్ని తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణం రుణం రూ. 29,500 కోట్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news