వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా మరో ఎమ్మెల్యే రాజీనామ చేశారు.దీంతో వైసీపీకి షాక్ తగిలిందనే చెప్పాలి.

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసలు ఎక్కువవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారీ రోశయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గుంటూరులో బుధవారం అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీకి నష్టం చేసే వారికి వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసారని..ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి వైసీపీలో కొనసాగడం ఇష్టం లేకనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.

Read more RELATED
Recommended to you

Latest news