ఎక్కడ పోటీ చేయాలో నాకు తెలుసు : గంటా శ్రీనివాసరావు

-

టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో త్వరలో వెల్లడిస్తానని టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు. ‘నేను ఎక్కడ పోటీ చేయాలో నాకు తెలుసు. టీడీపీ అధిష్టానానికి స్పష్టత ఉంది. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా’ అని చెప్పారు. కాగా ఇప్పటివరకు ఒక నియోజకవర్గం నుంచి వరుసగా ఆయన పోటీ చేసిన దాఖలాలు లేవు.

ganta srinivas

2019లో విశాఖ నార్త్ నుంచి నెగ్గగా…. అంతకు ముందు భీమిలి, అనకాపల్లి, చోడవరం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ మునిగిపోయే నావ..ఈ పాలన అంతం అవుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో చేరెందుకు పెద్ద సంఖ్య లో నేతలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు గంటా. జగన్ ను నమ్ముకున్న నేతలకు కూడా ఆయన న్యాయం చెయ్యలేదు.. జగన్ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news