ఏపీ రైతులకు శుభవార్త..పశువుల కోసం జనరిక్ మందుల కేంద్రాలు

-

ఏపీ రైతులకు శుభవార్త. పశువుల కోసం జనరిక్ మందుల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పశువుల కోసం జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వైఎస్ఆర్ పశు ఔషధ నేస్తం పథకంలో భాగంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా విజయవాడలోని ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాలలో జనరిక్ మందుల కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

ఇక అటు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈనెల 14న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచి 19 ఏళ్ల వయసున్న 1.07 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, అంగన్వాడీలు, స్కూల్లు, కాలేజీల్లో ఉచితం గా వీటిని అందిస్తాం అంది. 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు 400mg మాత్రలో సగం మాత్ర ను పొడిచేసి నీళ్లలో కలిపి ఇవ్వాలని, 2-3 ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను నీళ్లలో కలిపి తాగించాలి అంది.

Read more RELATED
Recommended to you

Latest news